Studio18 News - ANDHRA PRADESH / : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేశారు. అలాగే, తిరుమల, తిరుపతిలో అక్టోబరు నెల గదుల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదలవుతుంది. అదే రోజున నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. ప్రతి నెల స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలతో పాటు వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తారు.
Admin
Studio18 News