Monday, 23 June 2025 03:31:22 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Telugu Woman: ఎడారి దేశంలో చిక్కుకుని తెలుగు మ‌హిళ అగ‌చాట్లు.. కాపాడాలంటూ వేడుకోలు!

Date : 09 September 2024 02:34 PM Views : 108

Studio18 News - ANDHRA PRADESH / : ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన ఓ తెలుగు మ‌హిళ అక్క‌డ మోస‌పోయింది. ఉపాధి బ‌దులు య‌జమాని ఆమెను నిర్బంధించాడు. దాంతో స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చేందుకు త‌న‌కు సాయం చేయాల్సిందిగా ఆమె వేడుకుంది. త‌న‌ను ప్ర‌భుత్వం కాపాడాల‌ని, స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు స‌హాయం చేయాల‌ని కోరింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా మార్కాపురం ప‌ట్ట‌ణం ప‌దో వార్డుకు చెందిన షేక్ మ‌క్బుల్ బీ, ఖాద‌ర్‌బాషా దంప‌తులు. ఇద్ద‌రు పిల్ల‌లున్న ఈ జంట రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, గల్ఫ్ దేశాల‌కు వెళ్తే అక్క‌డ మంచి ఉపాధి దొరికి త‌మ జీవితాలు బాగుప‌డతాయ‌ని భావించిన మ‌క్బుల్ బీ ఆ దిశగా ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్ర‌మంలో ఆమెకు హైద‌రాబాద్‌లో ఉండే ఓ ఏజెంట్ గురించి తెలిసింది. ఆ ఏజెంట్‌ను సంప్ర‌దించ‌డంతో ఆమెను మ‌స్క‌ట్ పంపించాడు. అక్క‌డ ఓ య‌జ‌మాని వ‌ద్ద ఇంట్లో ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని ఆగ‌స్టు 25న మ‌స్క‌ట్ పంపారు. అయితే, అక్క‌డకు వెళ్లిన ఆమెకు రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ప‌ని దొర‌క‌లేదు. పైగా ఆమెను ఓ గ‌దిలో బంధించి ఒక పూటే ఆహారం ఇస్తూ ఇక్క‌ట్లకు గురిచేస్తున్నారు. అక్క‌డి వారిని త‌న‌ను స్వ‌దేశానికి పంపించాల‌ని కోరితే రూ. 1.50ల‌క్ష‌లు ఇవ్వాల‌ని చెబుతున్నారంటూ ఆమె సెల్ఫీ వీడియా ద్వారా త‌న గోడును వెళ్ల‌బుచ్చింది. ఎలాగైనా ప్ర‌భుత్వం త‌న‌ను కాపాడి, స్వ‌దేశానికి ర‌ప్పించే ఏర్పాట్లు చేయాల‌ని మ‌క్బుల్ బీ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :