Studio18 News - ANDHRA PRADESH / : Pawan Kalyan on YS Jagan attitude: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అధికారం పోయినా జగన్ అహంకార ధోరణి మారలేదని విమర్శించారు. ”జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే విమర్శలు చేస్తున్నారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తు కుట్రలకు తెరలేపుతున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనం. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానన్న భ్రమల్లోంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో? రాష్ట్రాభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబుకు.. నేను నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తామ”ని పవన్ కల్యాణ్ చెప్పారు.జగన్కు భంగపాటు తప్పదు: సత్యకుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ కూడా.. జగన్ ధోరణిపై మండిపడ్డారు. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా ఆయనను పట్టించుకునేవారు లేరని, ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని సూచించారు. రాష్ట్రానికి ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలసి కట్టుగా ప్రయత్నిద్దామని అన్నారు.
Admin
Studio18 News