Monday, 24 March 2025 07:09:53 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

విజయవాడ ముంపు ప్రాంతాల్లో బోటుపై సీఎం చంద్రబాబు పర్యటన.. ఆదుకుంటామని బాధితులకు హామీ

Date : 02 September 2024 11:08 AM Views : 74

Studio18 News - ANDHRA PRADESH / : Vijayawada Floods : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, ఇతర వదర ప్రభావిత ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. వరద నీరు తగ్గేవరకు పరిస్థితిని పర్యవేక్షిస్తామని, బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రికి తరలిస్తామని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలకు దగ్గరలోనే ఉంటామని భరోసా ఇచ్చారు. అటు సింగ్ నగర్ గండి పూడ్చడంపై చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నేను ఇక్కడే ఉంటా- సీఎం చంద్రబాబు ”విజయవాడలో పరిస్థితులు చూశాక చాలా బాధేస్తోంది. కొన్ని వేల మంది లోపల ఉన్నారు. ప్రజలు దీనావస్థలో ఉన్నారు. తాగునీరు కూడా లేవు. ఇవన్నీ చూశాక నేను ఇక్కడే ఉంటాను. రాత్రి కూడా ఇక్కడే ఉంటాను. అందరికీ న్యాయం జరిగే వరకు, అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను అండగా ఉంటాను. బాధితులను కాపాడతాం. ఇళ్లపై ఉన్న వారికి, అందరికీ భరోసా ఇస్తున్నా. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాను. పూర్తిగా వాళ్లను అన్ని విధాలుగా రక్షించే వరకు ఇక్కడే ఉంటాను. బోట్లు పెడతాం. బాధితులకు కావాల్సిన నిత్యవసర సరకులు, తాగునీరు అందిస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. లక్షా 50వేల మందికి ఆహారం.. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. లక్ష 50వేల మందికి అక్షయ పాత్ర ద్వారా సరిపడ ఆహారాన్ని సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో మంగళగిరిలోని అక్షయ పాత్ర క్యాంటీన్ లో లక్ష 50వేల మందికి సరిపడ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని విజయవాడలోని వరద బాధితులకు అందించనున్నారు. ఖర్చు గురించి ఆలోచన చేయొద్దని, అన్ని దుకాణాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలని సీఎం చంద్రబాబు అధికారులు ఇప్పటికే ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :