Monday, 24 March 2025 06:29:26 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

ఆక్రమణల వల్లే బుడమేరు సగం నగరాన్ని ముంచేసింది.. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ కీలక సూచన

Date : 04 September 2024 04:57 PM Views : 67

Studio18 News - ANDHRA PRADESH / : Pawan Kalyan : రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు, చాలా ఛాలెంజస్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి విపత్తు వచ్చింది. బుడమేరు కాలువ 90శాతం ఆక్రమణలో ఉంది. ఆక్రమణల వల్లే బుడమేరు సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. వాగులు వెళ్లే దారిలో ఆక్రమణలు చెయ్యడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఆక్రమణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వరదలు ముంచెత్తడంతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు రాత్రిపగలు తేడాలేకుండా పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ.. వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని పవన్ అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు అందించడం జరుగుతుందని చెప్పారు. వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానుకొని సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలి. ముందు వైసీపీ సహాయంచేసి అప్పుడు మాపై విమర్శలు చేయండి. ఇళ్లలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని వైసీపీ నేతల తీరును పవన్ విమర్శించారు. నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారుల సూచనతో నేను వెనక్కి తగ్గాను. అలాఅని నేను ఏమీ చేయడం లేదని అనడం సరికాదు. పవన్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించే వైసీపీ నేతలు నాతో ఒక్కసారి వచ్చి చూడండి.. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుందంటూ పవన్ అన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేలా రాజకీయ నాయకులు ప్రవర్తించాలి. ఇప్పటికైనా విమర్శలు మానుకొని వైసీపీ నేతలు ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయం అందించాలని పవన్ సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :