Wednesday, 19 March 2025 07:12:08 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

Divvala Madhuri: నా భార్య‌పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది: మాధురి భ‌ర్త మ‌హేశ్

Date : 13 August 2024 02:54 PM Views : 64

Studio18 News - ANDHRA PRADESH / : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్య‌వ‌హారం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. సినిమా క‌థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్‌ ఎపిసోడ్స్ ఈ వ్య‌వ‌హారంలో చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నారనే మ‌న‌స్థాపంతో... ఆగి ఉన్న కారును త‌న కారుతో ఢీకొట్టి ఆత్మ‌హత్యాయ‌త్నం చేశారు. దాంతో ఈ ప్రమాదంలో గాయ‌ప‌డిన ఆమె పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తాజాగా మాధురి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ వ్య‌వ‌హారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త దివ్వెల మ‌హేశ్ చంద్ర‌బోస్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టం లేద‌న్నారు. కానీ, మాధురి ఇష్ట‌ప‌డ‌టంతో వైసీపీలోకి వెళ్ల‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని తెలిపారు. త‌న భార్య‌పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కావాల‌ని ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన త‌ర్వాత మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. దువ్వాడ వాణి రాజకీయ కోణంలోనే త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆ కార‌ణంగానే తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశానని ఆమె చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :