Thursday, 15 May 2025 02:44:59 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై చంద్ర‌బాబు దిగ్భ్రాంతి

Date : 08 August 2024 02:50 PM Views : 116

Studio18 News - ANDHRA PRADESH / : ప‌శ్చిమ‌ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం క‌న్నుమూశారు. బుద్ధదేవ్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా, బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా పని చేశారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయల్లో కొనసాగారు. అయితే, 2011లో జరిగిన ఎన్నికలలో బుద్ధదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బెంగాల్ లో 34 సంవత్సరాల సీపీఐ(ఎమ్) పాలన ముగిసింది. ఇక బుద్ధదేవ్ మ‌ర‌ణం గురించి తెలుసుకుని ప‌లువురు ప్ర‌ముఖులు విచారం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న మృతిప‌ట్ల సంతాపం తెలిపారు. "ప్రముఖ సీపీఐ(ఎమ్) నేత‌, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మ‌ర‌ణ‌వార్త దిగ్భ్రాంతి క‌లిగించింది. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవకు అంకిత‌మైన మ‌హామ‌నిషి. ప్ర‌జా సేవ‌ పట్ల ఆయ‌న‌ సరళత, అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఆయ‌న‌ తన రాష్ట్రం ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :