Wednesday, 30 April 2025 10:04:37 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Madhusudan Reddy: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Date : 19 August 2024 05:30 PM Views : 83

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ విధించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం ఈ మేరకు తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. కేంద్ర సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించింది. కాగా, మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. మధుసూదన్ రెడ్డిపై విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ జరుగుతోందని, ఈ విచారణకు మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉండడం కోసం, ఆయన డిప్యుటేషన్ ను మరో ఆరు నెలలు పొడిగించాలని రైల్వే బోర్డును కోరింది. ఏపీలో మధుసూదన్ రెడ్డి డిప్యుటేషన్ ఆగస్టు 22తో ముగియనుంది. ఆయన 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయనపై విచారణ జరుగుతున్న విషయాన్ని రైల్వే బోర్డుకు వివరించింది. మరోవైపు... ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ ను పొడిగిస్తూ భారత కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది. కోస్ట్ గార్డ్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన వెంకట్ రెడ్డిపై కూడా అవినీతి సంబంధిత ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం లేఖకు కోస్ట్ గార్డ్ స్పందిస్తూ... ఈ నెల 31 వరకు వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగించినట్టు ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో వెల్లడించింది. అంతేకాదు, వెంకట్ రెడ్డి అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని కోస్ట్ గార్డ్ కార్యాలయం పేర్కొంది. సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఈ నెల 31న వెంకట్ రెడ్డి పదవీవిరమణ చేయనున్నారని వివరించింది. తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని సీఎస్ కు రాసిన లేఖలో కోస్ట్ గార్డ్ స్పష్టం చేసింది. ఇసుక, గనుల శాఖలో అక్రమాలపై వెంకట్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :