Friday, 14 November 2025 03:04:44 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Madhusudan Reddy: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Date : 19 August 2024 05:30 PM Views : 199

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ విధించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వం ఈ మేరకు తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. కేంద్ర సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపించింది. కాగా, మధుసూదన్ రెడ్డి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. మధుసూదన్ రెడ్డిపై విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ జరుగుతోందని, ఈ విచారణకు మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉండడం కోసం, ఆయన డిప్యుటేషన్ ను మరో ఆరు నెలలు పొడిగించాలని రైల్వే బోర్డును కోరింది. ఏపీలో మధుసూదన్ రెడ్డి డిప్యుటేషన్ ఆగస్టు 22తో ముగియనుంది. ఆయన 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయనపై విచారణ జరుగుతున్న విషయాన్ని రైల్వే బోర్డుకు వివరించింది. మరోవైపు... ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ ను పొడిగిస్తూ భారత కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది. కోస్ట్ గార్డ్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన వెంకట్ రెడ్డిపై కూడా అవినీతి సంబంధిత ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం లేఖకు కోస్ట్ గార్డ్ స్పందిస్తూ... ఈ నెల 31 వరకు వెంకట్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగించినట్టు ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో వెల్లడించింది. అంతేకాదు, వెంకట్ రెడ్డి అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని కోస్ట్ గార్డ్ కార్యాలయం పేర్కొంది. సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఈ నెల 31న వెంకట్ రెడ్డి పదవీవిరమణ చేయనున్నారని వివరించింది. తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలని సీఎస్ కు రాసిన లేఖలో కోస్ట్ గార్డ్ స్పష్టం చేసింది. ఇసుక, గనుల శాఖలో అక్రమాలపై వెంకట్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :