Saturday, 24 January 2026 08:34:57 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

మదనపల్లె కేసు చంద్రబాబు స్కెచ్.. కుట్రలన్నీ ఎదుర్కొంటాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Date : 07 August 2024 02:32 PM Views : 281

Studio18 News - ANDHRA PRADESH / : Peddireddy Ramachandra Reddy : రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వ నేతలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాపోయారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లె ఫైళ్లు దగ్ధం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ”నిజాలతో సంబంధం లేకుండా మా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చంద్రబాబు తన అనకూల పత్రికల్లో అవాస్తవాలు రాయిస్తున్నారు. నాలాంటి వాళ్లపై దాడులు చేస్తున్నారు. మా కుటుంబంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచాం. కొన్ని చానళ్లు అత్యుత్సాహంతో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల హామీలు నెరవేర్చలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటే ఆయన భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు. మదనపల్లెలో రికార్డులు తగలబడితే మాపై నిందలు వేస్తున్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగించినా, సీబీఐకి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించడమే కాకుండా.. వారి ద్వారా నా పేరు చెప్పించేందుకు కుట్ర జరుగుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అతి దారుణంగా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కేసుల్లో కూటమి ప్రభుత్వం వేగంగా పనిచేసిందా? మదనపల్లెలో రికార్డులు తగలబడితే ఏదో జరిగిపోతోందనేలా డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమి మమ్మల్ని ఇరికించాలనే అత్యుత్సాహంతో డీజీపీని పంపించి చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. ఏదీఏమైనా ఈ కుటలన్నీ ఎదుర్కొంటాం. మాపై పెట్టిన కేసులు తప్పని నిరూపిస్తామ”ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :