Thursday, 15 May 2025 02:55:17 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Venigandla Ramu: డాలస్‌లో పర్యటించిన గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. మాతృభూమి అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపు

Date : 04 September 2024 02:41 PM Views : 109

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము ఆదివారం డాలస్‌లో పర్యటించారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా తొలుత ఇర్వింగ్ పట్టణంలోని మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు ఆయనకు మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల ఘనస్వాగతం పలికారు. శాసనసభ్యుడు రాము బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. తాను ఎంతో కాలంగా ఈ మెమోరియల్‌ గురించి వింటున్నానని, కానీ ఇప్పటి వరకు రాలేకపోయానని తెలిపారు. 2014లో స్థాపించిన ఈ మెమోరియల్ అమెరికాలోనే అతిపెద్దది కావడం, ఇప్పుడు పదో వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాంతాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రవాస భారతీయులందరూ ఐకమత్యంతో కలసి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని అనడానికి ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. దీనిని ఒక రోజులో నిర్మించలేదని, డాక్టర్ ప్రసాద్ తోటకూర దూరదృష్టితోనే అది సాధ్యమైందని, అధికారులను ఒప్పించేందుకు దాదాపు ఐదేళ్లు కష్టపడ్డారని గుర్తుచేశారు. ఈ నిర్మాణంలో సహకరించిన బోర్డ్ సభ్యులు రావు కల్వాల, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, ఎంవీఎల్ ప్రసాద్, బీఎన్ రావు మొదలైన కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. మన దేశం నుంచి వివిధ పార్టీలకు చెందిన ఎందరో రాజకీయనాయకులు, ప్రముఖులు ఈ మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచమంతా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత వాతావరణంలో మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆశయాల గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాము అన్నారు. పరస్పర అవగాహన, గౌరవం, చర్చల ద్వారా ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న శాంతి కాముకుడు గాంధీజీ ప్రపంచ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రవాసులుగా స్థిరపడిన వారందరూ మాతృదేశ అభివృద్ధికి వీలైనంతగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, వెనిగండ్ల రాము అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :