Monday, 17 March 2025 11:58:09 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

Date : 12 August 2024 11:21 AM Views : 64

Studio18 News - ANDHRA PRADESH / : Duvvada Family Controversy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె నిరసన దీక్ష నాల్గోరోజూ కొనసాగుతుంది. ఇంటి ఆరుబయటే వాణి, హైందవి పడుకున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా వారు చెబుతున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆదివారం పలాస జాతీయ రహదారిపై కారు ప్రమాదంతో మాధురి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది. అయితే, స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. మాధురికి మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తలరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం పలాస జాతీయ రహదారిపై మాధురి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేను ఆత్మహత్య చేసుకోవాలనే కారును యాక్సిడెంట్ చేశానని చెప్పింది. తన పై ట్రోలింగ్ చేస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్య యత్నం చేశానని తెలిపింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, కానీ, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడం జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో ఆమె కారు నుజ్జునుజ్జు అయింది. నిర్లక్ష డ్రైవింగ్ తోపాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం.. నూతన జాతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం పోలీసులు దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :