Saturday, 07 March 2026 08:05:03 PM
# ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..?

Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పవన్ సంచలన నిర్ణయం.. ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి..

Date : 10 August 2024 10:56 AM Views : 361

Studio18 News - ANDHRA PRADESH / : Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాల్లో, పాలనలో కొత్త మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కొత్త కార్యక్రమాలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరిలో దేశభక్తి పెంపొందించాలని, ప్రతి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయితీల్లో ఆగస్టు 15న వేడుకలకు ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ నిధులను ఒకేసారి గణనీయంగా పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత ఉండకూడదని, అందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందించనున్నారు. ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ డబ్బుతో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి, జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పంచాయితీ ఉద్యోగులు అంతా ఇందులో పాల్గొనాలని సూచించారు పవన్ కళ్యాణ్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :