Wednesday, 30 April 2025 07:44:30 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Nagineni Kannayya Naidu: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై ప్రముఖ ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఆందోళన

Date : 21 August 2024 03:04 PM Views : 113

Studio18 News - ANDHRA PRADESH / : శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్‌ లాగ్‌ను విజయవంతంగా అమర్చిన ఆయన నీటి వృథాను అరికట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం ముగుస్తోందని, ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడు సూచించారు. ‘ఈటీవీ’ ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు. 1970కి ముందు నిర్మించిన ప్రాజెక్టులకు స్టాండ్ బై గేట్లు ఏర్పాటు చేయలేదని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. కాబట్టే, ఇప్పుడు తుంగభద్రకు స్టాప్‌లాగ్ బిగించాల్సి వచ్చిందని తెలిపారు. తుంగభద్రకు ప్రమాదం పొంచి ఉందని రెండేళ్ల క్రితమే చెప్పానని, ఒకవేళ సమస్య వస్తే ఏం చేయాలనే దానిపై అప్పటి నుంచే ఆలోచించినట్టు తెలిపారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూసిన తనకు ప్రాణం చలించిపోయిందని, రైతులకు అందాల్సిన నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని బాధ అనిపించిందని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల వయసు అయిపోయిందని, కొత్త గేట్లు బిగించుకోవాల్సిందేనని చెప్పానని, అలా అయితే మరో 30 ఏళ్లపాటు దాని సేవలు అందించవచ్చని వివరించానని కన్నయ్యనాయుడు పేర్కొన్నారు. కాబట్టి డ్యాం భాగస్వాములు ముగ్గురూ కలిసి కూర్చుని చర్చించుకోవాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఇందుకు మొత్తం రూ. 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పానని పేర్కొన్నారు. వారు అందుకు తగిన చర్యలు తీసుకుంటే అవసరమైన సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పానని వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వయసు కూడా అయిపోయిందని, వాటిని ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌లోనే నడుపుతున్నట్టు కన్నయ్యనాయుడు తెలిపారు. తుంగభద్రలాంటి ఘటనలు దేశంలో జరిగినా.. నీళ్లు ఉండగా ఎక్కడా స్టాప్ లాగ్‌లు అమర్చలేదని స్పష్టం చేశారు. సాగర్, శ్రీశైలం విషయంలో రెండు ప్రభుత్వాలు కూర్చుని ప్లాన్ యాక్షన్ వేసి చర్యలు తీసుకోకపోతే కష్టమేనని కన్నయ్యనాయుడు తేల్చి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :