Sunday, 07 December 2025 09:40:13 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Nagineni Kannayya Naidu: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై ప్రముఖ ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఆందోళన

Date : 21 August 2024 03:04 PM Views : 323

Studio18 News - ANDHRA PRADESH / : శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్‌ లాగ్‌ను విజయవంతంగా అమర్చిన ఆయన నీటి వృథాను అరికట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం ముగుస్తోందని, ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడు సూచించారు. ‘ఈటీవీ’ ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు. 1970కి ముందు నిర్మించిన ప్రాజెక్టులకు స్టాండ్ బై గేట్లు ఏర్పాటు చేయలేదని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. కాబట్టే, ఇప్పుడు తుంగభద్రకు స్టాప్‌లాగ్ బిగించాల్సి వచ్చిందని తెలిపారు. తుంగభద్రకు ప్రమాదం పొంచి ఉందని రెండేళ్ల క్రితమే చెప్పానని, ఒకవేళ సమస్య వస్తే ఏం చేయాలనే దానిపై అప్పటి నుంచే ఆలోచించినట్టు తెలిపారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూసిన తనకు ప్రాణం చలించిపోయిందని, రైతులకు అందాల్సిన నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని బాధ అనిపించిందని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల వయసు అయిపోయిందని, కొత్త గేట్లు బిగించుకోవాల్సిందేనని చెప్పానని, అలా అయితే మరో 30 ఏళ్లపాటు దాని సేవలు అందించవచ్చని వివరించానని కన్నయ్యనాయుడు పేర్కొన్నారు. కాబట్టి డ్యాం భాగస్వాములు ముగ్గురూ కలిసి కూర్చుని చర్చించుకోవాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఇందుకు మొత్తం రూ. 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పానని పేర్కొన్నారు. వారు అందుకు తగిన చర్యలు తీసుకుంటే అవసరమైన సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పానని వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వయసు కూడా అయిపోయిందని, వాటిని ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌లోనే నడుపుతున్నట్టు కన్నయ్యనాయుడు తెలిపారు. తుంగభద్రలాంటి ఘటనలు దేశంలో జరిగినా.. నీళ్లు ఉండగా ఎక్కడా స్టాప్ లాగ్‌లు అమర్చలేదని స్పష్టం చేశారు. సాగర్, శ్రీశైలం విషయంలో రెండు ప్రభుత్వాలు కూర్చుని ప్లాన్ యాక్షన్ వేసి చర్యలు తీసుకోకపోతే కష్టమేనని కన్నయ్యనాయుడు తేల్చి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :