Monday, 23 June 2025 03:39:35 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు: వైఎస్ జగన్ ఫైర్

Date : 08 August 2024 03:18 PM Views : 125

Studio18 News - ANDHRA PRADESH / : పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… సీఎంగా ఉన్న వ్యక్తి ధర్మం, న్యాయాలను పరిరక్షించకపోతే ఈ పదాలకు అర్థమే ఉండదని చెప్పుకొచ్చారు. తాము అదే స్థానంలో ఉంటే హుందాగా వ్యవహరించేవాళ్లమని తెలిపారు. పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలకు పూర్తిగా గండికొట్టారని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి మనం పలావు పెట్టామని, కాని చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారని చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని అన్నారు. ప్రజలు మళ్ల పస్తులతో ఉండాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలతో ఎన్నికల ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యిందని చెప్పారు. ఈ రెండు నెలల కాలంలోనే విపరీతమైన వ్యతిరేక వచ్చిందని తెలిపారు. స్కూళ్లు నాశనం అయిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు ఉంటాయా? లేవో? అన్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి కూడా అంతేనని అన్నారు. వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయని చెప్పారు. అబద్ధం, అవాస్తవం అనేవి ఎప్పుడూ నిలబడవని అన్నారు. చంద్రబాబు అబద్ధాల వల్ల ఆయనకు అధికారం వచ్చిందని తెలిపారు. ఐదేళ్ల పాలనలో క్యాలెండర్‌ పెట్టి మరీ ప్రతి ఇంటికీ పథకాలు అందించామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :