Sunday, 08 September 2024 05:53:00 AM
# Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతులు విజయవంతం # Kubera Movie: వినాయ‌క చ‌వితి స్పెష‌ల్... 'కుబేర' నుంచి కొత్త‌ పోస్ట‌ర్ # Arvind Kejriwal: లిక్కర్ పాలసీ ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు: సీబీఐ # Chiranjeevi: చిరంజీవి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు # Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు # Yasir Arafat: పాక్ క్రికెట్ బోర్డు ఓ స‌ర్క‌స్‌.. అందులో అంద‌రూ జోక‌ర్లే: యాసిర్ అరాఫ‌త్‌ # CM Revanth Reddy: కీలక వ్యక్తికి విద్యా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్ # irrigation officials: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు # Pervez Musharraf: భార‌త్‌లో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.38 కోట్ల‌కు వేలం! # Brij Bhushan: నాటి కుట్ర నేడు బట్టబయలైంది.. వినేశ్ ఫొగాట్ రాజకీయ ప్రవేశంపై బ్రిజ్ భూషణ్ విమర్శ # Dharshan: అశ్లీల సందేశాలతో మొదలై... హత్యకు గురయ్యే దాకా...! రేణుకా స్వామి హత్యలో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు # Babar Azam: బాబర్ ఆజామ్‌కు షాక్‌.. పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌​ ఎవరంటే? # T20 Blast 2024: బౌలర్‌తో సంబంధం లేని.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన నోబాల్.. # Budameru: హమ్మయ్య.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు # TGSRTC: పాప్యులారిటీ కోసం ఇలాంటి సోయిలేని ప‌నులు చేయ‌కండి.. సజ్జనార్ ఫైర్‌! # Military School: మిలటరీ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల # Chandrababu: సీఎం చంద్ర‌బాబు క‌లిసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ # Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి సందేహాలు # Chandrababu: విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు # CV Anand: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Chandrababu: జగన్... దొంగ ఏడుపులు, నంగిమాటలు వద్దు... ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా!: సీఎం చంద్రబాబు సవాల్

Date : 26 July 2024 03:44 PM Views : 48

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపిస్తున్నాడే తప్ప, ఆ చనిపోయిన వాళ్ల పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. "రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతడి ఇంటికి వెళ్లాం అని చెప్పుకుంటున్నారు... ఎవరీ రషీద్? చంపినవాడెవడు? చచ్చినవాడెవడు? వాళ్లు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా, లేదా? సరే అది అయిపోయింది... 36 మంది చనిపోయారని గవర్నర్ వద్దకు వెళ్లావు... ఆ 36 మంది పేర్లు ఇవ్వండి. రషీద్ అనే వ్యక్తిని చంపినవాళ్లను అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, నీకు సిగ్గుంటే, నీజాయతీ ఉంటే ఆ పేర్లు ఇవ్వు... గతంలో నువ్వు చంపిన వాళ్ల పేర్లు నేనిచ్చాను... ఇప్పుడు వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటా... మళ్లీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తాం... ఇవాళ నువ్వు చెబుతున్న వాటిపై కూడా నేను చర్యలు తీసుకుంటా... సిద్ధమా అని సవాల్ విసురుతున్నా. మాయ మాటలు మాట్లాడకు... దొంగ ఏడుపులు వద్దు... నంగి మాటలు వద్దు. తప్పు చేస్తే మా పార్టీ వాళ్లను కూడా శిక్షిస్తానని చెప్పాను. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం కాదు. ఆ ముసుగు తీస్తాం... నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :