Saturday, 24 January 2026 09:08:34 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్..

Date : 29 August 2024 04:52 PM Views : 278

Studio18 News - ANDHRA PRADESH / : Amaravati Farmers : ఏపీ రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని రైతుల ఖాతాల్లోకి త్వరలో నిధులు విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను వచ్చే నెల 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులు పొలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ పొలాలు ఇవ్వడంతో వారు పంట నష్టపోయారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు వారికి కౌలు ఇవ్వాలని గతంలో చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించే విషయంపై ఆలోచన చేసింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో.. వారికి మరో ఐదేళ్లు కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు కూడా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కౌలును మరో ఐదేళ్లు ఇవ్వనుంది ప్రభుత్వం. వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి కౌలుకు సంబంధించిన నిధులను జమ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే కేబినెట్ లో కూడా దీనిపై డెసిషన్ తీసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం ఈ తీసుకున్నామని కేబినెట్ భేటీలో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :