Thursday, 15 May 2025 03:18:11 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్..

Date : 29 August 2024 04:52 PM Views : 81

Studio18 News - ANDHRA PRADESH / : Amaravati Farmers : ఏపీ రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని రైతుల ఖాతాల్లోకి త్వరలో నిధులు విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను వచ్చే నెల 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులు పొలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ పొలాలు ఇవ్వడంతో వారు పంట నష్టపోయారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు వారికి కౌలు ఇవ్వాలని గతంలో చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించే విషయంపై ఆలోచన చేసింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో.. వారికి మరో ఐదేళ్లు కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు కూడా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కౌలును మరో ఐదేళ్లు ఇవ్వనుంది ప్రభుత్వం. వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి కౌలుకు సంబంధించిన నిధులను జమ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే కేబినెట్ లో కూడా దీనిపై డెసిషన్ తీసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటాలు, త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మేము నిర్ణయం ఈ తీసుకున్నామని కేబినెట్ భేటీలో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :