Thursday, 15 May 2025 02:42:44 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. జగన్‌ను పలకరించిన రఘురామ కృష్ణరాజు.. జగన్ ఏమన్నారంటే?

Date : 22 July 2024 12:12 PM Views : 117

Studio18 News - ANDHRA PRADESH / : YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఇదిలాఉంటే.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీలో జగన్ ను పలుకరించారు. అసెంబ్లీలో జగన్ పక్కనే కూర్చొని మాట్లాడారు. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ మోహన్ రెడ్డిని రఘురామ కోరారు.. హాజరవుతానని జగన్ బదులిచ్చారు. వారిద్దరి మధ్య కొన్ని నిమిషాలు ఆసక్తికర చర్చ జరిగింది. కొద్దిసేపటి తరువాత జగన్ ముభావంగా ఉండటంతో రఘురామ అక్కడి నుంచి వచ్చేశారు. జగన్ చేతిలో చేయివేసి రఘురామ మాట్లాడినట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు. దీంతో వారిద్దరి ఏం చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ తో మాట్లాడిన తరువాత పయ్యావుల కేశవ్ వద్దకు రఘురామ వచ్చారు.. తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని కోరారు. దీంతో కేశవ్ నవ్వుతూ అలాగే అంటూ వెళ్లిపోయాడు.అసెంబ్లీ లాబీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డిని పలకరించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డిని కోరానని, వచ్చే సమావేశాల నుంచి జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని ఆశిస్తున్నానని రఘురామ అన్నారు. జగన్ శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నానని, అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి పక్కనే నాకు సీటు కేటాయించాలని కోరతానని రఘురామ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :