Studio18 News - ANDHRA PRADESH / : YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఇదిలాఉంటే.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీలో జగన్ ను పలుకరించారు. అసెంబ్లీలో జగన్ పక్కనే కూర్చొని మాట్లాడారు. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ మోహన్ రెడ్డిని రఘురామ కోరారు.. హాజరవుతానని జగన్ బదులిచ్చారు. వారిద్దరి మధ్య కొన్ని నిమిషాలు ఆసక్తికర చర్చ జరిగింది. కొద్దిసేపటి తరువాత జగన్ ముభావంగా ఉండటంతో రఘురామ అక్కడి నుంచి వచ్చేశారు. జగన్ చేతిలో చేయివేసి రఘురామ మాట్లాడినట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు. దీంతో వారిద్దరి ఏం చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ తో మాట్లాడిన తరువాత పయ్యావుల కేశవ్ వద్దకు రఘురామ వచ్చారు.. తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని కోరారు. దీంతో కేశవ్ నవ్వుతూ అలాగే అంటూ వెళ్లిపోయాడు.అసెంబ్లీ లాబీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డిని పలకరించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డిని కోరానని, వచ్చే సమావేశాల నుంచి జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని ఆశిస్తున్నానని రఘురామ అన్నారు. జగన్ శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నానని, అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి పక్కనే నాకు సీటు కేటాయించాలని కోరతానని రఘురామ అన్నారు.
Admin
Studio18 News