Wednesday, 30 April 2025 09:48:43 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Mahesh Babu: తిరుమల కొండకు కాలినడకన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు.. ఫొటో వైరల్

Date : 15 August 2024 11:53 AM Views : 87

Studio18 News - ANDHRA PRADESH / : కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తులు తాము అనుకున్నది జరిగితే నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటుంటారు. ఇందులో సామాన్య భక్తులు మొదలుకొని సినీ, రాజకీయ, వ్యాపార వాణిజ్య ప్రముఖులు ఉంటుంటారు. సాధారణంగా విఐపీలు, వీవీఐపీలు నేరుగా తిరుమల కొండపైకి చేరుకుని బ్రేక్ దర్శనంలో సులువుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. తాజాగా, ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార..తిరుమలకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్రత శిరోద్కర్ నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి నడక మార్గంలో స్వామి వారి దర్శనానికి బయలుదేరారు. మహేశ్ బాబు కుటుంబ సభ్యుల వెంట అభిమానులు కూడా నడిచారు. వీరు నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండపైకి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం రాత్రి తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిధి గృహంలో బస చేసిన మహేశ్ బాబు కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :