Saturday, 07 March 2026 08:07:48 PM
# డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

Pulichintha: పులిచింతలకు జలకళ.. గేట్లు ఎత్తిన అధికారులు

Date : 06 August 2024 11:13 AM Views : 482

Studio18 News - ANDHRA PRADESH / : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తొంది. కృష్ణా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుండటంతో నిన్న సాగర్ గేట్లు ఎత్తి దిగువకు లక్షన్నర క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో గత పది రోజుల క్రితం వరకూ నీరు లేక అడుగంటిన పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఇటీవల కాలం వరకూ పులిచింతలలో జలకళ లేక అడుగున ఉన్న రాళ్లు కనిపించాయి. ప్రస్తుతం పులిచింతలకు సాగర్ టైల్ పాండ్ నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుండి పులిచింతలకు 30,388 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు 26,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.6789 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో ఈ రోజు మరి కొన్ని గేట్లు తెరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెద్దగా లేకపోయినప్పటికీ భారీ వరద దృష్ట్యా అధికారులు గేట్లు ఎత్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :