Sunday, 20 April 2025 02:02:06 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Amaravati: నేడు అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం రాక

Date : 02 August 2024 11:49 AM Views : 137

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు ఈ పర్యటనలో భాగంగా అధ్యయనం చేయనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులను ఎక్కడికక్కడ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2019కి ముందు నిర్మాణం ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా...మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో నిర్మాణం నిలిచిపోయిన కట్టడాల పటిష్ఠతపై ముందుగా ఒక అంచనాకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటీ ఇంజనీర్‌లతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్ఠత నిర్ధారణ కోసం ఐఐటీ చెన్నైకి బాధ్యతలు అప్పగించింది. అలానే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్ఠతను తేల్చేపనిని ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగించినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో 2019కు ముందు నిర్మాణ పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటి ఇంజినీర్లు నేడు అమరావతికి రానున్నారు. ఆయా నిర్మాణాల పటిష్ఠత, ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలించనున్నారు. సెక్రటేరియట్, హెచ్‌ఓడీ కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్‌లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్ధ్యాన్ని ఐఐటీ బృందం పరిశీలించనుంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ల నుంచి ఇద్దరు ఇంజినీర్లున్న రెండు బృందాలు అమరావతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నాయి. అక్కడి కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశవుతారు. ఈ విషయాన్ని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :