Wednesday, 25 June 2025 07:35:14 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Chandrababu: తన ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగిందని ఒక కోటి విరాళం ఇచ్చాడు: సీఎం చంద్రబాబు

Date : 26 July 2024 05:53 PM Views : 136

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ నాయకుడు అయినా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. మనం ట్రస్టీలం మాత్రమే... పెత్తందార్లం కాదు అని స్పష్టం చేశారు. ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం... తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ గడచిన ఐదేళ్లలో జరిగింది ఇదేనని అన్నారు. దాదాపు 7 లక్షల ఉద్యోగాలు పోవడంతో పాటు, రూ.3 లక్షల కోట్ల ఆస్తులు తరిగిపోయాయి అని వివరించారు. "ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగించాలి. అది రైతు పండించే వరి కావొచ్చు... ఫ్యాక్టరీలో తయారయ్యే సూదులు కావొచ్చు. లేకపోతే ఏవైనా వస్తువులు కావొచ్చు, లేకపోతే సేవలు కావొచ్చు. ఏదైనా ముందుకు వెళుతుంటేనే ఆర్థిక క్రియాశీలత పెరుగుతుంది. మొన్న ఒకాయన వచ్చాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ రూ.100 కోట్లు పెరిగింది... అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం ఇస్తున్నాను అని చెప్పాడు. వంద కోట్లు పెరిగాయి కాబట్టి ఉదారంగా ఒక కోటి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ వంద కోట్లు పెరగకపోతే ఈ ఒక్క కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. భూమికి విలువ ఉన్నప్పుడు పిల్లల చదువులకు గానీ, ఆసుపత్రి ఖర్చులకు గానీ ఒక అర ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివన్నీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది" అని చంద్రబాబు వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :