Wednesday, 30 April 2025 08:35:59 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

ఏపీలో వరుసగా ఫైళ్లు దగ్ధం ఘటనలు.. అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన.. పలువురిపై వేటు

Date : 19 August 2024 11:59 AM Views : 71

Studio18 News - ANDHRA PRADESH / : Files Burns In AP : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు ప్రాంతాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు దగ్దమవుతున్న విషయం తెలిసిందే. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం కేసు ఇప్పటికే ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా.. అధికారులు కుట్రకోణం ఉందని గుర్తిచారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎక్కడ‌ ఫైళ్లు పడేసినా, కాల్చివేసినా అక్రమార్కుల కుట్రగానే ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా పనికిరాని ఫైళ్లను పడేయాలన్నా అధికారులు, ఉద్యోగులు భయపడుతున్నారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కేసును సీఐడీకి అప్పగించగా.. కుట్ర కోణం ఉందని గుర్తించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ముద్దాలుగా ఉండటంతో పెద్దిరెడ్డి పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద పైళ్లు కాల్చివేత ఘటన.. తాజాగా పోలవరం భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లు దగ్దం ఘటన. ఇలా వరుస ఘటనలతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు, అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా.. పలు అరెస్టులు జరిగాయి. ఆదివారం తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కొన్ని ఫైల్స్ దగ్దమయ్యాయి. ధవళేశ్వరం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ (ఎల్ఎంసీ – ఎల్ఏ)కు చెందిన కాగితాలు దహనం ఘటనలో అధికారులు విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రాథమిక విచారణలో సంబంధిత పత్రాలు ప్రాధాన్యత లేనివిగా గుర్తించారు. అనప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్య వైఖరిగా భావించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన కలెక్టర్.. ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్లకి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :