Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. జకియా ఖానమ్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా కానీ ఆమె శాసనమండలికి హాజరవుతున్నారు. ఆమె ఇటీవలే మంత్రి ఫరూఖ్ ను కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా, జకియా ఖానమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. లోకేశ్ తో పలు అంశాలపై ఆమె చర్చించారు.
Admin
Studio18 News