Sunday, 08 March 2026 10:57:08 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

దేశ వ్యాప్తంగా ఈ ఇష్యూను లేవనెత్తుతాం: వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి

Date : 20 July 2024 03:36 PM Views : 400

Studio18 News - ANDHRA PRADESH / : కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చించామని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. దాడులను ఆపేలా దేశ వ్యాప్తంగా ఇష్యూను లేవనెత్తుతామని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ దాడుల సంస్కృతిని పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ తమ పార్టీ బలంగా ఉంటుందని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఇటువంటి ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయని చెప్పారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టాలని అన్నారు. అధికారంలో ఉన్నవారు ఇలాంటి దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే మరిన్ని దాడులు జరుగుతాయని అన్నారు. రాజకీయ పార్టీలు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. సోమవారం జరిగే అసెంబ్లీలో నిరసన తెలియజేస్తామని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి ఈ దాడుల గురించి వివరిస్తామని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ఇలాంటి సంస్కృతి మంచిదికాదని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో తామెక్కడా ఇలాంటి దాడులకు పాల్పడలేదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :