Friday, 14 February 2025 07:15:20 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?

Date : 12 August 2024 05:44 PM Views : 59

Studio18 News - ANDHRA PRADESH / : Visakha MLC By Election 2024 : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్ధమైంది. అయితే కూటమి అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి తరుపున పోటీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అనూహ్య పరిణామాల తర్వాత కూటమి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరును కూటమి ఖరారు చేసినట్లు సమాచారం. చంద్రబాబు అనుమతితో దీనిపై అధికారికంగా ప్రకటించనున్నారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో బైరా దిలీప్ చక్రవర్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని సమాచారం. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు