Sunday, 08 March 2026 10:48:41 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Parthasarathy: అంత ఘోరంగా ఓడించినప్పటికీ ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు: మంత్రి పార్థసారథి

Date : 04 August 2024 03:53 PM Views : 439

Studio18 News - ANDHRA PRADESH / : ప్రజలు అంత ఘోరంగా ఓడించినప్పటికీ వైసీపీ అధినేత జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శలు గుప్పించారు. ఇవాళ పార్థసారధి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… ప్రజల్లో తనకున్న కాస్త నమ్మకాన్ని కూడా జగన్ పోగొట్టుకుంటున్నారని తెలిపారు. టిడ్కో బాధితులను వైసీపీ సర్కారు మానసికంగా హింసించిందని, తాము న్యాయం చేస్తామని పార్థసారథి చెప్పారు. వైసీీపీ హయాంలో జరిగిన భూబాగోతంపై విచారణ జరిపిస్తామని, రైతుల భూములను తక్కువ ధరకుకొని ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్మిన ఘనులు వైసీపీ నేతలని ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్టుకు, సర్కారుకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఎక్కడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పారు. కాగా, తాము కక్ష సాధింపు చర్యలకు దిగబోమని కూటమి సర్కారు మొదటి నుంచీ చెబుతోంది. అయితే, నారా లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగానే కూటమి సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :