Monday, 23 June 2025 02:37:57 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Chandrababu Naidu: కక్ష సాధింపునకు పాల్పడాలనుకుంటే అలాగే చేయగలను: చంద్రబాబు

Date : 22 July 2024 03:16 PM Views : 173

Studio18 News - ANDHRA PRADESH / : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనను జైలుకు పంపారని, కక్ష సాధింపు చేయాలనుకుంటే తానూ చేయగలనని చెప్పారు. అయితే, కక్ష సాధింపు వ్యవహరాన్ని తాను పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా నడుచుకోవాలని అన్నారు. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని చెప్పారు. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఉంటే చెప్పాలని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాలేదని, జగన్ మాత్రం అప్పుడే విమర్శలు మొదలు పెట్టేశారని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. తప్పులు చేసి, ఇతరులపై నెట్టేయడం జగన్ కు అలవాటని అన్నారు. వైఎస్ వివేకానంద మృతి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని తెలిపారు. వినుకొండలోనూ ఇదే జరుగుతోందని అన్నారు. శాంతి భద్రతలలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని ఎమ్మెల్యేలకు చెప్పారు. కాగా, కూటమి మధ్య కో-ఆర్డినేషన్ అంశాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :