Studio18 News - ANDHRA PRADESH / : కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోట్లదుర్తి గ్రామంలోని జగనన్న కాలని సమీపంలో 158 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీలో పరకల చాటున ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని పక్కగా సమాచారం రావడంతో దాడులు నిర్వహించిన ఎర్రగుంట్ల పోలీసులు సుమారు 158 ఎర్రచందనం దుంగలతో పాటు మినీలారీని స్వాధీనం చేసుకుని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు మినీ లారీ డ్రైవర్ తో పాటు ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ కావడంతో వారిని పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
Admin
Studio18 News