Sunday, 20 April 2025 03:40:23 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వారందరూ వైసీపీని వీడుతున్నారన్న ప్రచారంలో నిజం లేదు: ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

Date : 30 August 2024 02:47 PM Views : 91

Studio18 News - ANDHRA PRADESH / : Alla Ayodhya Rami Reddy: వైసీపీ నేతలు పలువురు పార్టీని వీడడం పట్ల ఆ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజ్యసభ సభ్యులు అందరూ పార్టీని వీడుతున్నారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఒకరిద్దరు పార్టీని వీడినప్పటికీ తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదని, మిగిలిన వారిమంతా పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తమ గురించి తాము ఇలా చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు. రాజకీయాన్ని, పదవులను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటే నష్టపోతారని హెచ్చరించారు. అన్ని అనుకున్నట్లే జరగాలంటే రాజకీయాల్లో అసాధ్యమని, వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడాలనుకుంటే రాజకీయాల్లో ఉండకూడదని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పారు. జగన్ సామాన్యుడి గురించి ఆలోచించే వ్యక్తి అని, ఎవరికి సాయం అవసరమో వారి కోసం జగన్ పార్టీ పెట్టారని తెలిపారు. ఏదేమైనా జగన్ వెంటే ప్రయాణం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మోపిదేవి అంటే తమకు ఇష్టమని, ఆయనకి మరింత బలం ఇవ్వడానికే ప్రయత్నించామని అన్నారు. ఇబ్బందులు ఉన్నాయని పార్టీలు మారిపోతే విలువలు ఉండవని, సమస్యలు ఉన్నప్పటికీ జగన్ వెంటే తాను ఉంటానని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :