Tuesday, 11 November 2025 04:27:20 PM
# Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం # Ande Sri: అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన # Rajyalaxmi: అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆదుకునేందుకు కదిలిన ప్రవాస భారతీయులు # Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్ # Stock Market: ఐటీ, ఆటో షేర్ల జోరు... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ # Pakistan: నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర # Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు # Kommareddi Pattabhiram: రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్ధించుకుంటారా?: వైసీపీపై పట్టాభి ఫైర్ # Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్ 10 # Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష # Meena: మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా # Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి # Chandrababu Naidu: మంత్రులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు # Sunil Gavaskar: ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం # Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మీడియాపై అంబటి ఫైర్ # Nalgonda: నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు # 'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ! # Nadenla Manohar: ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల సమీక్ష... గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం # Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్ # Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి చిత్రం... 50 వేల మందితో అత్యంత భారీ ఈవెంట్

యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతాం.. జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Date : 21 July 2024 02:59 PM Views : 226

Studio18 News - ANDHRA PRADESH / : Janasena Party Leader Nagababu : జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ ను నాగబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్ధంగా పని చేశారు. పార్టీకోసం పనిచేసిన వారి కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆయన కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తలు కుటుంబాలకు అధినేత అండగా నిలిచారని నాగబాబు చెప్పారు. 17.45కోట్లు ఇప్పటి వరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని తెలిపారు.మాది మధ్యతరగతి కుటుంబం, ఎన్నో ఇబ్బందులు చూశాం. అనారోగ్యం పెద్దది అయితే.. చికిత్సకు డబ్బులులేని పరిస్థితి. ఇంటి పెద్దదిక్కు కోల్పేతే ఆ కుటుంబం అనేక పాట్లు పడుతుంది. జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే పవన్ కల్యాణ్ ఇలా భరోసా ఇచ్చారు. ప్రతిఒక్కరూ నేడు బీమా కట్టుకోవడం అలవాటు చేసుకోండి. పవన్ కళ్యాణ్ మూడు వేల మంది రైతులకు లక్ష చొప్పున ఇచ్చారు. ఒక నిర్మాతగా నేను నష్టపోతే నా తమ్ముడు పవన్ నాకు అండగా నిలిచాడు. నేను కూడా నా వంతుగా ఎంతోకొంత సాయం అందిస్తా. నాకు ఎటువంటి పదవుల‌పై కోరిక లేదు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు నాకు చేతనైనంత చేస్తానని నాగబాబు అన్నారు. నాకు ఓపిక ఉన్నంత వరకు జనసేనకోసం పనిచేస్తా. కూటమి అధికారంలోకి రావడం ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో ప్రజలకు మంచి జరుగుతుందని నాగబాబు చెప్పారు.వైసీపీ వాళ్లు నెల రోజులకే కాట్ల కుక్కలాగా వెంట పడుతున్నారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతాం. మీరు చేసిన ప్రతిపనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని వైసీపీ నేతలను నాగబాబు హెచ్చరించారు. చేసిన అవినీతి, అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదు. జగన్ తన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదు. ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని. గత ఐదేళ్లల్లో వారు చేసిన‌ నేరాలు, ఘోరాలు బయట పెడతాం. సీఎంగా అబద్దాలు చెప్పడంలో జగన్ కు డాక్టరేట్ ఇవ్వాలంటూ నాగబాబు విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. జరగలేదని జగన్ చెప్పాడు. కల్తీ సారా తాగి చనిపోతే.. సహజ మరణంగా జగన్ ప్రచారం చేశాడు. నేడు ఏపీ‌లో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్ కు సిగ్గుండాలి. ఇంతకంటే దిగజారకండి అని‌చెప్పే కొద్దీ ఇంకా దిగజారుతున్నారు అంటూ జగన్ తీరుపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుంది. కేంద్రం సహకారంతో ప్రజా పాలన అందరూ చూస్తారని నాగబాబు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :