Saturday, 17 January 2026 09:37:28 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు షురూ.. ‘జగన్ ప్రజలపై వేసిన భారం ఇది’

Date : 07 August 2024 02:09 PM Views : 272

Studio18 News - ANDHRA PRADESH / : Amaravati jungle clearance: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అడవిలా తయారైందని అన్నారు. ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి అమరావతి రాజధానిలో దట్టంగా పెరిగిపోయిన ముళ్లపొదల తొలగింపు పనులకు బుధవారం ఆయన శ్రీకారం చుట్టారు. వెలగపూడిలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు 40 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి నారాయణ ఈ సందర్బంగా తెలిపారు. ”రాజధాని నిర్మాణం కోసం మొదట్లో 41 వేల కోట్లతో టెండర్లు వేశాం. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది. ఇక్కడి రోడ్లు త్రవ్వేశారు. ఈ ప్రాంతాన్ని అడవి చేశారు. మొత్తం 58 వేల ఎకరాల్లో 24 వేల ఎకరాలు అడవి అయ్యింది. 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తాం. బిల్డింగ్స్, రోడ్లు పూర్తి చేస్తాం. ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చాక పనులు ప్రారంభిస్తాం. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ మరో ఐదేళ్లు పొడగిస్తున్నామ”ని మంత్రి నారాయణ చెప్పారు. ఈ రోజు సంతోషకరమైన రోజు: ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ అమరావతిపై ద్వేషంతో రాజధాని ప్రాంతాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారని ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ”ఈ రోజు సంతోషకరమైన రోజు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో 24, 230 ఎకరాలు చిట్టడవిగా మారిపోయింది. జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జగన్ ప్రజలపై వేసిన భారం ఇది. ఇక్కడి మెటీరియల్ దొంగలపాలైంది. కొన్నివేల కోట్లు ప్రజలపై జగన్ భారం పెట్టార”ని ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ విమర్శించారు. అమరావతిలో జోరందుకున్న నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి అమరావతిలో కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ (జంగిల్ క్లియరెన్స్) ప్రారంభమైంది. వీటిని తొలగించేందుకు CRDA రూ.36.50 కోట్లతో టెండర్లను పిలవగా NCCL సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :