Wednesday, 30 April 2025 07:04:46 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు షురూ.. ‘జగన్ ప్రజలపై వేసిన భారం ఇది’

Date : 07 August 2024 02:09 PM Views : 96

Studio18 News - ANDHRA PRADESH / : Amaravati jungle clearance: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అడవిలా తయారైందని అన్నారు. ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి అమరావతి రాజధానిలో దట్టంగా పెరిగిపోయిన ముళ్లపొదల తొలగింపు పనులకు బుధవారం ఆయన శ్రీకారం చుట్టారు. వెలగపూడిలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు 40 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి నారాయణ ఈ సందర్బంగా తెలిపారు. ”రాజధాని నిర్మాణం కోసం మొదట్లో 41 వేల కోట్లతో టెండర్లు వేశాం. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది. ఇక్కడి రోడ్లు త్రవ్వేశారు. ఈ ప్రాంతాన్ని అడవి చేశారు. మొత్తం 58 వేల ఎకరాల్లో 24 వేల ఎకరాలు అడవి అయ్యింది. 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తాం. బిల్డింగ్స్, రోడ్లు పూర్తి చేస్తాం. ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చాక పనులు ప్రారంభిస్తాం. రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్ మరో ఐదేళ్లు పొడగిస్తున్నామ”ని మంత్రి నారాయణ చెప్పారు. ఈ రోజు సంతోషకరమైన రోజు: ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ అమరావతిపై ద్వేషంతో రాజధాని ప్రాంతాన్ని జగన్ నిర్లక్ష్యం చేశారని ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ”ఈ రోజు సంతోషకరమైన రోజు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి ప్రజలపై ద్వేషంతో జగన్ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో 24, 230 ఎకరాలు చిట్టడవిగా మారిపోయింది. జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జగన్ ప్రజలపై వేసిన భారం ఇది. ఇక్కడి మెటీరియల్ దొంగలపాలైంది. కొన్నివేల కోట్లు ప్రజలపై జగన్ భారం పెట్టార”ని ఎమ్యెల్యే శ్రావణ్ కుమార్ విమర్శించారు. అమరావతిలో జోరందుకున్న నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి అమరావతిలో కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ (జంగిల్ క్లియరెన్స్) ప్రారంభమైంది. వీటిని తొలగించేందుకు CRDA రూ.36.50 కోట్లతో టెండర్లను పిలవగా NCCL సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :