Monday, 23 June 2025 02:51:56 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Biryani: రూ.2కే బిర్యానీ... ఇక చూస్కోండి... ఎక్కడో కాదు పశ్చిమగోదావరి జిల్లాలోనే!

Date : 08 August 2024 06:15 PM Views : 148

Studio18 News - ANDHRA PRADESH / : బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు అందరికీ నచ్చే ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొత్తగా ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తూ, బిర్యానీపై బంపర్ ఆఫర్ ప్రకటిస్తే జనాలు విరగబడ్డారు. దాంతో అందరికీ బిర్యానీ అందించలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. తాడేపల్లిగూడెంలోని ఉషా గ్రాండ్ వద్ద కొత్తగా బిర్యానీ హోటల్ తెరిచారు. రూ.2కే చికెన్ బిర్యానీ అని ప్రకటించారు. ఇంకేముంది... బిర్యానీ ప్రియులు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చిపడ్డారు. అయితే, హోటల్ నిర్వాహకులు 200 బిర్యానీ ప్యాకెట్లు మాత్రమే సిద్ధం చేయగా, అక్కడికి వచ్చిన వాళ్ల సంఖ్య 2 వేల వరకు ఉంటుంది. దాంతో బిర్యానీ ప్యాకెట్లు అందనివాళ్లు తీవ్ర నిరాశ చెందారు. బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రావాల్సి వచ్చింది. స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. జనానికి సర్దిచెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :