Friday, 18 July 2025 06:50:44 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Achennaidu: సమాధి రాళ్లపై వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించాడు: అచ్చెన్నాయుడు

Date : 30 July 2024 04:17 PM Views : 138

Studio18 News - ANDHRA PRADESH / : సమాధి రాళ్లపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేయించుకోవడం విడ్డూరమన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి ట్వీట్ చేశారు. 'రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు.. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు రైతులందరి పొలాల్లో సర్వే రాళ్లపై నీ (జగన్) ఫోటోలు వేయించావు. ప్రజల సొమ్ము రూ.650 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసి పబ్లిసిటీ స్టంట్లు చేసినందుకే నిన్ను ఇంటికి పంపించారు.' అంటూ జగన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 'ఫొటోల పిచ్చి ఖరీదు రూ.700 కోట్లు' అని రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చిందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫొటోల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది అంటూ ఆ కథనం పేర్కొంది. నాటి వైసీపీ ప్రభుత్వం చేష్టలకు అధికారులు దాసోహం అన్నారని విమర్శించింది. అధికారులు ఏమాత్రం అడ్డు చెప్పకుండా నిధులు ఖర్చు చేశారని ఆరోపించింది. దీనిని అచ్చెన్నాయుడు పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :