Thursday, 22 May 2025 03:37:27 PM
# కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా

Stock Market: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

Date : 11 September 2024 05:43 PM Views : 104

Studio18 News - ANDHRA PRADESH / : దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398 పాయింట్లు క్షీణించి 81,523 వద్ద... నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 24,918 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ బ్యాంకు 262 పాయింట్లు క్షీణించి 51,010 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, విప్రో, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్స్, రిలయన్స్ వంటి హెవీ వెయిట్స్ టాప్ లూజర్లుగా నిలిచాయి. ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు టాప్ గెయినర్లుగా నిలిచాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకులు, ఫిన్ సర్వీస్, మెటల్, రియాల్టీ, ఎనర్జీ లాభపడగా... ఎఫ్ఎంసీజీ, వినియోగ రంగాలు నష్టపోయాయి. యూఎస్ వినియోగ ద్రవ్యోల్బణం డేటాకు ముందు పెట్టుబడిదారులు అప్రమత్తత పాటించారని, అందుకే మార్కెట్ నష్టాల్లో ముగిసిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ వైభవ్ విద్వాని తెలిపారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయంపై యూఎస్ వినియోగ ద్రవ్యోల్బణ డేటా ప్రభావం ఉంటుందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :