Saturday, 24 January 2026 08:32:36 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Budameru : బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

Date : 09 September 2024 11:11 AM Views : 272

Studio18 News - ANDHRA PRADESH / : Budameru Flood : విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరులోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో గండ్లు పడి వరద నీరు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. ఫలితంగా మనిషిలోతు నీళ్లు రావడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించారు. పదిరోజులుగా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు భోజన సదుపాయాలు, తాగునీరు అందజేస్తుంది. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చి వేసింది. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో బాధితులు ఊపీరిపీల్చుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు బుడమేరులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :