Monday, 24 March 2025 07:00:03 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

Budameru : బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

Date : 09 September 2024 11:11 AM Views : 73

Studio18 News - ANDHRA PRADESH / : Budameru Flood : విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరులోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో గండ్లు పడి వరద నీరు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. ఫలితంగా మనిషిలోతు నీళ్లు రావడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించారు. పదిరోజులుగా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు భోజన సదుపాయాలు, తాగునీరు అందజేస్తుంది. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చి వేసింది. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో బాధితులు ఊపీరిపీల్చుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు బుడమేరులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :