Wednesday, 12 November 2025 04:46:31 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన..

Date : 10 September 2024 05:29 PM Views : 350

Studio18 News - ANDHRA PRADESH / : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖపట్టణంలోని కూర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితులతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ లీడర్లు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, నిర్వాసితుల ఆందోళనలతో కూర్మన్నపాలెంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఇచ్చిన హామీలను రెండు నెలలు గడిచినా అమలు చేయలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :