Sunday, 08 March 2026 03:24:53 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Kollu Ravindra: కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట

Date : 13 September 2024 02:33 PM Views : 285

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా ఆయన పాస్ పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 20న కొల్లు రవీంద్ర విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన పాస్ పోర్టును పునరుద్ధరించాలని పాస్ పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు. అయితే రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండటంతో ఆయన పాస్ పోర్టును పునరుద్ధరించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో రవీంద్ర నిన్న హైకోర్టును ఆశ్రయించారు. రవీంద్ర పిటిషన్ ను హైకోర్టు విచారించింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్ పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలో జరగనున్న 'మైన్ ఎక్స్ పో' కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొనాల్సి ఉంది. దీంతో పాస్ పోర్టు పునరుద్ధరణ కోసం హైకోర్టును రవీంద్ర ఆశ్రయించారు. కొల్లు రవీంద్ర తరపున న్యాయవాది ఎంవీ రమణకుమారి వాదనలు వినిపించారు. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయనే కారణంగా పాస్ పోర్టును తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులిచ్చాయని ఆమె వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్ పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు పిటిషన్ ను విచారించిన హైకోర్టు పాస్ పోర్టును పునరుద్ధరించాలని ఆదేశించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :