Studio18 News - ANDHRA PRADESH / : యూరప్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకుంటూ పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ సాయంత్రం 4.04 గంటలకు కౌంట్ డౌన్ ముగియగా... పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా అనేది అత్యంత ప్రకాశవంతమైన భాగం కావడంతో... ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రోబా-3 శాటిలైట్లకు రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్య గ్రహణాలను సృష్టించి కరోనాపై పరిశోధనలు సాగించడం ప్రోబా-3 ప్రత్యేకత.
Also Read : సంధ్య థియేటర్ ఘటనపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందన
Admin
Studio18 News