Thursday, 12 March 2026 03:13:18 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Tragedy | స్కూల్‌కు లేట్‌గా వచ్చాడని బయట నిలబెట్టిన టీచర్‌.. గోడ కూలి విద్యార్థి మృతి

Tragedy | కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కవ్వాడి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాల గోడ కూలి విద్యార్థి మరణించాడు.

Date : 15 September 2025 07:36 PM Views : 159

Studio18 News - ANDHRA PRADESH / Kurnool : Tragedy | కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కవ్వాడి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాల గోడ కూలి విద్యార్థి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీలోని కీర్తి ఇంగ్లీస్‌ మీడియం స్కూల్‌లో రాఖీబ్‌ (5) ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం నాడు అతను స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడు. రాఖీబ్‌తో పాటు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను టీచర్‌ క్లాస్‌ బయట కాంపౌండ్‌లో నిల్చోబెట్టారు. ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్‌ గోడ కూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో రాఖీబ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు స్కూల్‌ గోడకూలి విద్యార్థి మరణించడం పట్ల మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లలో భద్రతా ప్రమాణాల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడి బాలుడి కుటుంబానికి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :