Monday, 17 February 2025 04:13:38 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

YS Jagan: కుటుంబ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవే: జగన్

Date : 24 October 2024 03:41 PM Views : 86

Studio18 News - ANDHRA PRADESH / : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్ల‌లో ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల గుర్ల‌లో అతిసారం స్వైర‌విహారం కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోదైన విష‌యం తెలిసిందే. దాదాపు 10 మంది డయేరియాతో చ‌నిపోయినట్టు తెలుస్తోంది. మ‌రికొంద‌రు ఇప్ప‌టికీ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో... అతిసారం ప్ర‌బ‌లి చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌ను జ‌గ‌న్ నేడు ప‌రామ‌ర్శించారు. వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా క‌ల్పించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... ఆస్తుల వ్యవహారంపై స్పందించారు. కుటుంబ గొడ‌వ‌ల్లో క‌ల్పించుకోవ‌డం త‌గ‌ద‌ని హితవు ప‌లికారు. కుటుంబ గొడ‌వ‌లు ప్ర‌తి ఇంట్లో ఉండేవేన‌ని, వాటిని అడ్డుపెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌ మ‌రోసారి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ద‌త్త‌పుత్రుడు అంటూ సంభోదిస్తూ విమ‌ర్శించారు. కూట‌మి ప్ర‌భుత్వంపైనా జగన్ ధ్వ‌జ‌మెత్తారు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ఆపి, హామీల‌ను అమ‌లు చేయాల‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌గ‌న్ పేరు చెప్పి డైవ‌ర్ట్ చేయ‌డం ప్ర‌భుత్వానికి ప‌రిపాటిగా మారింద‌ని ఎద్దేవా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు