Tuesday, 11 November 2025 05:16:13 PM
# Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం # Ande Sri: అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన # Rajyalaxmi: అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆదుకునేందుకు కదిలిన ప్రవాస భారతీయులు # Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్ # Stock Market: ఐటీ, ఆటో షేర్ల జోరు... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ # Pakistan: నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర # Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు # Kommareddi Pattabhiram: రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్ధించుకుంటారా?: వైసీపీపై పట్టాభి ఫైర్ # Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్ 10 # Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష # Meena: మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా # Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి # Chandrababu Naidu: మంత్రులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు # Sunil Gavaskar: ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం # Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మీడియాపై అంబటి ఫైర్ # Nalgonda: నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు # 'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ! # Nadenla Manohar: ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల సమీక్ష... గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం # Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్ # Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి చిత్రం... 50 వేల మందితో అత్యంత భారీ ఈవెంట్

తిరుమలలో చైనీస్ ఫుడ్ పై నిషేధం.. హోటళ్లకు మార్గదర్శకాలు జారీ!

Date : 09 May 2025 07:27 PM Views : 179

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుమల క్షేత్రంలో విక్రయించే ఆహార పదార్థాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపై చైనీస్ ఫుడ్ ఐటమ్స్ విక్రయించడంపై శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల ఆరోగ్యం, ఆహార నాణ్యత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. తిరుమలలోని హోటళ్లు, తినుబండారాల శాలల్లో లభించే ఆహార పదార్థాల నాణ్యతపై ఇటీవల భక్తుల నుంచి పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తిరుమలలోని హోటళ్ల యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భక్తులకు అందించే ఆహారం విషయంలో పలు ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ప్రధానంగా చైనీస్ ఫుడ్ అంశం చర్చకు వచ్చింది. ఇకపై తిరుమలలో ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా వంటి ఎలాంటి చైనీస్ తరహా ఆహార పదార్థాలను విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, దీనిని కచ్చితంగా పాటించాలని హోటళ్ల నిర్వాహకులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన, శుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల అభిరుచులకు అనుగుణంగా వారికి నచ్చిన రీతిలో వైవిధ్యమైన భారతీయ వంటకాలను అందించాలని సూచించారు. ఆహార తయారీలో, హోటళ్ల నిర్వహణలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని నొక్కిచెప్పారు. ఆహార నాణ్యతతో పాటు, హోటళ్ల నిర్వహణకు సంబంధించి కూడా అదనపు ఈవో పలు మార్గదర్శకాలను జారీ చేశారు. హోటళ్లలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా సంప్రదాయాలను గౌరవిస్తూ, అందుకు అనుగుణమైన వస్త్రధారణలోనే విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి హోటల్ వద్ద ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ తదితర ధృవీకరణ పత్రాలను అధికారులకు, భక్తులకు స్పష్టంగా కనిపించేలా ఫ్రేమ్ చేసి ప్రదర్శించాలి చెప్పారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపుల విధానాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని దుకాణాలలో తప్పనిసరిగా ధరల పట్టికను ప్రదర్శించాలని, నిర్దేశిత ధరలకే విక్రయాలు జరపాలని చెప్పారు. హోటల్ నిర్వహణ లైసెన్సులను నిర్ణీత సమయంలో పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :