Sunday, 08 March 2026 03:19:26 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Nara Lokesh: ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌

Date : 17 September 2024 03:14 PM Views : 426

Studio18 News - ANDHRA PRADESH / : మంత్రి నారా లోకేశ్ త‌న 'యువ‌గ‌ళం పాద‌యాత్ర' సంద‌ర్భంగా ఇచ్చిన మాట‌ను తాజాగా నెర‌వేర్చారు. 'యువ‌గళం.. మ‌న‌గ‌ళం' నినాదంతో మొద‌ట చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేశ్‌ పాద‌యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా పాద‌యాత్ర పూర్త‌యిన ప్ర‌తి 100 కిలోమీట‌ర్ల వ‌ద్ద ఒక శిలాఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మొద‌టి 100 కిమీ మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్నారు. దాంతో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 100 రోజుల్లో గ్రామంలో డ‌యాల‌సిస్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని లోకేశ్ ఆవిష్క‌రించిన శిలాఫ‌ల‌కంలో పొందుప‌రిచారు. అలా ఇచ్చిన మాట ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా వంద రోజులు పూర్తి చేసుకోవ‌డంతో బంగారుపాళ్యంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కావాల్సిన యంత్రాలు, స్పెష‌ల్ నీటి శుద్ధి ప‌రిక‌రాలు, ప‌డ‌క‌లను సెంట‌ర్‌లో ఏర్పాటు చేశారు. బంగారుపాళ్యం, ఐరాల‌, అర‌గొండ త‌దిత‌ర ప్రాంతాల‌కు చెందిన సుమారు 72 మంది డ‌యాల‌సిస్ రోగులు ప్ర‌స్తుతం చిత్తూరుకు వెళ్లి డ‌యాల‌సిస్ చేయించుకుంటున్నారు. ఇక‌పై వారికి ఆ అవ‌స‌రం లేదు. ఈ కేంద్రం వారంద‌రికీ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ఆసుప‌త్రి సిబ్బంది పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :