Monday, 24 March 2025 06:05:52 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

Chandrababu: పిల్లల కోసం నీళ్లడిగితే ఇవ్వలేని పరిస్థితి చూశా.. వరదలపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్

Date : 25 September 2024 01:45 PM Views : 74

Studio18 News - ANDHRA PRADESH / : ‘మూడు రోజులుగా మంచినీళ్లు లేవు.. పిల్లల కోసం మీరు నీళ్లు పంపించగలరా’ అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా మంచినీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులను కలిశానని చెప్పారు. బాధితులు పెద్ద కోరికలు అడగలేదని, తాగడానికి అది కూడా పిల్లల కోసం మంచినీళ్లు అడిగారని గుర్తుచేసుకున్నారు. వెంటనే అధికారులను పంపించి లక్షలాది వాటర్ బాటిళ్లను సేకరించి పంచామని చెప్పారు. మొత్తంగా కోటికి పైగా వాటర్ బాటిళ్లను పంచామని చెప్పారు. విజయవాడ వాసులు ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. ఓవైపు ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షం (క్లౌడ్ బరస్ట్), మరోవైపు బుడమేరుకు కనివినీ ఎరుగని వరద వచ్చిందని చెప్పారు. బుడమేరు గండ్లను పూర్చడానికి అధికార యంత్రాంగం పగలూరాత్రి కష్టపడిందన్నారు. రోజుల తరబడి వరదల్లోనే అధికారులు, మంత్రులతో పాటు తాను కూడా తిరిగానని చెప్పారు. బాధితులకు మనోధైర్యం ఇస్తూ ముందుకు సాగామన్నారు. రోజుల తరబడి తాను కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద సాయంపై పర్యవేక్షణ చేశానన్నారు. డ్రోన్లను, ఫైరింజన్లను, ప్రొక్లెయిన్లను ఉపయోగించి బాధితులను ఆదుకున్నామని చెప్పారు. దాతలకు పాదాభివందనాలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తొలిసారిగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 400 కోట్ల రూపాయలు విరాళం అందిందన్నారు. వరద బాధితుల పరిస్థితి చూసి స్పందించి విరాళం పంపిన దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దాతలకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. మానవతా దృక్ఫథంతో స్పందించారని చెబుతూ.. వీల్ చెయిర్ పై వచ్చి, అమెరికా నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఉంటున్న వారిని స్వయంగా పంపించి చెక్కులు అందజేశారని తెలిపారు. స్కూలు పిల్లలు కూడా ఐదు, పది రూపాయలు, కిడ్డీ బ్యాంకులు పగలకొట్టి డబ్బులు తెచ్చిచ్చారని వివరించారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. సంఘటితంగా ముందుకు వస్తే విపత్తులను ఎదుర్కోవచ్చని చాటిచెప్పారని దాతలను కొనియాడారు. వరద బాధితులకు అందజేసినవి.. 1. 14 కోట్ల వాటర్ బాటిళ్లు 37 లక్షల మిల్క్ బాటిళ్లు 47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు 5 లక్షల కోడి గుడ్లు 3.50 లక్షల క్యాండిల్స్ 2.30 లక్షల మ్యాచ్ బాక్సులు 1.15 కోట్ల ఆహార ప్యాకెట్లు 5 వేల క్వింటాళ్ల కూరగాయలు దాదాపుగా 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రోడ్లను ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది క్లీన్ చేశారు. 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శానిటేషన్ డిపార్ట్ మెంట్ సిబ్బంది తొలగించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :