Thursday, 15 May 2025 02:09:08 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Liquor Tenders: ఏపీలో మ‌ద్యం దుకాణాల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

Date : 09 October 2024 12:18 PM Views : 90

Studio18 News - ANDHRA PRADESH / : కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చిన ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌ మ‌ద్యం దుకాణాల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ద్యం షాపులు ద‌క్కించుకోవాల‌నుకునే ఆశావ‌హుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించింది. ఈ మేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. టెండ‌ర్ల షెడ్యూల్ గడువు పెంచాలని కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున్న అభ్య‌ర్థ‌న‌లు రావ‌డంతో ఎక్సైజ్ అధికారులు ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స‌ర్కార్ షెడ్యూల్‌ను మార్చింది. 11వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌రఖాస్తులు స్వీకరించి, 14న మ‌ద్యం షాపుల‌కు లాట‌రీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి దుకాణాల‌ను కేటాయిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,396 మ‌ద్యం దుకాణాల‌కు గాను మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు 41,348 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. త‌ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ. 826.96 కోట్ల ఆదాయం వ‌చ్చినట్టు స‌మాచారం. ఒక్కో ద‌ర‌ఖాస్తుకు నాన్‌-రిఫండ‌బుల్ కింద రూ. 2 ల‌క్ష‌లు చెల్లించాలన్న విష‌యం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :