Thursday, 12 March 2026 12:41:33 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Narendra Modi: ఏపీ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

Date : 12 November 2025 07:07 PM Views : 208

Studio18 News - ANDHRA PRADESH / Sri Satyasai : ఈ నెల 19న శ్రీసత్యసాయి జిల్లాకు ప్రధాని రాక సత్యసాయి శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్న మోదీ ఈ నెల 22న సత్యసాయి వర్సిటీలో స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తిరుచానూరు సందర్శన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోమారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి రానున్న ప్రధాని.. వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. మరోవైపు, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23న జరిగే స్నాతకోత్సవంలో ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు పాల్గొంటారు. హిల్ వ్యూ స్టేడియంలో ఉత్సవాలు.. సత్యసాయి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 23 వరకు పది రోజుల పాటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జయంతి ఉత్సవాలను హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల ఏర్పాట్లపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తాజాగా మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఎమ్మెస్‌ రాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్‌జైన్‌ పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీతో కలిసి మంత్రి అనగాని ప్రసాద్ పరిశీలించారు. తిరుచానూరుకు రాష్ట్రపతి ముర్ము.. ఈ నెల 17 నుంచి 25 తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పరిసరాలతో పాటు పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టీటీడీ సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారని ఈవో తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :