Tuesday, 31 March 2026 04:31:15 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ

Date : 07 February 2026 06:51 PM Views : 124

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న శ్రీనివాసవర్మ కల్తీ జరిగిందని వైవీ, భూమన, చెవిరెడ్డి ఇప్పుకున్నారని వ్యాఖ్య స్వామివారికి హారతి ఇచ్చే నెయ్యిని కల్తీ చేశారని మండిపాటు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పారు. లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అన్నారు. కానీ, ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురూ కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని శ్రీనివాసవర్మ అన్నారు. కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ అని ప్రశ్నించారు. బోలేబాబాకు పాల ఉత్పత్తి, డెయిరీ లేకపోయినా నెయ్యి తయారు చేశారని వివరించారు. టెండర్ల నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేశారని... అవినీతి కోసం అలా చేశారని అన్నారు. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తామని... అలాంటి నెయ్యిని కల్తీ చేశారని మండిపడ్డారు. అర్హత లేని వారికి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారుశ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :