Saturday, 24 January 2026 03:01:36 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pawan kalyan : 449 మంది విద్యార్థుల‌ త్రాగునీటి సమస్య తీర్చిన ఉప ముఖ్యమంత్రి

Date : 15 October 2024 04:37 PM Views : 415

Studio18 News - ANDHRA PRADESH / : Pawan kalyan : గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ర‌క్షిత త్రాగునీరు స‌దుపాయం లేక ఇబ్బందులు ప‌డుతున్న 449 మంది విద్యార్థుల అవ‌స్థ‌ల‌ను ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీర్చారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో 449 మంది విద్యార్థులు ఉన్నారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ర‌క్షిత త్రాగునీరు స‌దుపాయం లేక విద్యార్థులు ప‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య ఉప‌ముఖ్య మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంట‌నే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌మీపంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర రైస్ మిల్ వ‌ద్ద మంచినీరు వ‌స్తున్న విష‌యాన్ని అధికారులు గుర్తించారు. రైస్ మిల్ యాజ‌మాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు. 4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో ఆర్వో ప్లాంట్ కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :