Tuesday, 31 March 2026 04:36:55 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర!

Date : 07 February 2026 07:39 PM Views : 147

Studio18 News - ANDHRA PRADESH / Chittoor : మైనర్ బాలుడితో 37 ఏళ్ల వివాహిత అక్రమ సంబంధం సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్త, అత్త హత్యకు కుట్ర ప్రియుడితో కలిసి అత్తపై కత్తితో దాడి చేయించిన మహిళ ప్రజలు రావడంతో విఫలమైన హత్యాయత్నం, బాలుడు అరెస్ట్ పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు కవిత, పోలీసుల గాలింపు చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నగరం చామంతిపురానికి చెందిన కవిత (37)కు 17 ఏళ్ల క్రితం విజయ్‌తో వివాహమైంది. వీరికి 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కవిత అదే ప్రాంతంలో నివసించే 17 ఏళ్ల బాలుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త విజయ్‌, అత్త నిర్మల పలుమార్లు ఆమెను హెచ్చరించారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న కవిత, తన సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే భర్తను, అత్తను హత్య చేయాలంటూ తన ప్రియుడైన మైనర్ బాలుడిని రెచ్చగొట్టింది. ఆమె మాటలు నమ్మిన బాలుడు, ఈ నెల‌ 5వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న నిర్మలపై దాడికి తెగబడ్డాడు. ఆమె కళ్లల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, నిర్మల అతడిని గట్టిగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. జనాలను చూసి భయపడిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన నిర్మలను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కవిత రెచ్చగొట్టడం వల్లే తాను ఈ దాడికి పాల్పడినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కవిత పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :