Monday, 15 December 2025 01:10:39 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

నేడే లాటరీ.. కిక్కు ఎవరికో… ఏపీలో మద్యం దుకాణాలకు డ్రా..

Date : 14 October 2024 10:30 AM Views : 239

Studio18 News - ANDHRA PRADESH / : Ap Liquor Shop Lottery : ఏపీ వ్యాప్తంగా 3వేల 396 మద్యం దుకాణాలకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వాటిని పున:పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 దుకాణాలకు అత్యధికంగా 5వేల 764 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు విధించనుంది. క్వార్టర్ బాటిల్ ను 99 రూపాయలకే విక్రయించేలా సవరణ చేసింది. ఏపీలో నూతన మద్యం విధానం అమలు చేసేందుకు సమయం వచ్చేసింది. ఇటీవలే టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ టెండర్లు ఓపెన్ చేసి లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయించనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యక్తులకు 15వ తేదీన వారికి సంబంధించిన షాపులను అప్పగిస్తారు. 16వ తేదీ నుంచి షాపులకు కొత్త మద్యాన్ని అందజేస్తారు. అదే రోజున మద్యం విక్రయాలు జరగనున్నాయి. మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వం ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో నాన్ రీఫండబుల్ ఫీజు కింద ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. అంతకుమించి ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు వివిధ జిల్లాల్లో దాదాపుగా ఒక్కో దుకాణానికి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున చూసుకుంటే ఒక్కో షాపుకి 25 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. మ్యానువల్ పద్ధతిలో డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు అధికారులు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :