Monday, 17 March 2025 11:28:30 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

నేడే లాటరీ.. కిక్కు ఎవరికో… ఏపీలో మద్యం దుకాణాలకు డ్రా..

Date : 14 October 2024 10:30 AM Views : 47

Studio18 News - ANDHRA PRADESH / : Ap Liquor Shop Lottery : ఏపీ వ్యాప్తంగా 3వేల 396 మద్యం దుకాణాలకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వాటిని పున:పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 దుకాణాలకు అత్యధికంగా 5వేల 764 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు విధించనుంది. క్వార్టర్ బాటిల్ ను 99 రూపాయలకే విక్రయించేలా సవరణ చేసింది. ఏపీలో నూతన మద్యం విధానం అమలు చేసేందుకు సమయం వచ్చేసింది. ఇటీవలే టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ టెండర్లు ఓపెన్ చేసి లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయించనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యక్తులకు 15వ తేదీన వారికి సంబంధించిన షాపులను అప్పగిస్తారు. 16వ తేదీ నుంచి షాపులకు కొత్త మద్యాన్ని అందజేస్తారు. అదే రోజున మద్యం విక్రయాలు జరగనున్నాయి. మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వం ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో నాన్ రీఫండబుల్ ఫీజు కింద ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. అంతకుమించి ఆదాయం సమకూరింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు వివిధ జిల్లాల్లో దాదాపుగా ఒక్కో దుకాణానికి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున చూసుకుంటే ఒక్కో షాపుకి 25 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. మ్యానువల్ పద్ధతిలో డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు అధికారులు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :