Sunday, 15 March 2026 10:15:56 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Nara Lokesh: అమరావతికి అంతర్జాతీయ లా వర్సిటీ... కీలక బిల్లులకు మండలి ఆమోదం

Date : 27 September 2025 06:51 PM Views : 186

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం వర్సిటీ కోసం 55 ఎకరాలు కేటాయించిన కూటమి ప్రభుత్వం ఏపీ విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వ్ చేస్తూ నిర్ణయం విదేశీ వర్సిటీల రాకను సులభతరం చేసేలా ప్రైవేటు వర్సిటీల చట్టంలో మార్పులు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి లోకేశ్ వెల్లడి మండలిలో మూడు కీలక విద్యా బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపనను సులభతరం చేసే సవరణ బిల్లులకు, మరికొన్ని మార్పులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మూడు కీలక బిల్లులను మండలిలో ప్రవేశపెట్టగా, సభ వాటికి ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో న్యాయ విద్యకు కొత్త శోభ రాష్ట్రంలో న్యాయ విద్య, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్’ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేశ్ సభ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గవర్నర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను రాష్ట్రానికి సాధించుకోగలిగాం" అని తెలిపారు. అమరావతిలో ఈ విశ్వవిద్యాలయం కోసం కూటమి ప్రభుత్వం 55 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, ఇందులో ఏపీ విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు ప్రకటించారు. వర్సిటీతో పాటు ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇదే సమయంలో, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీని నిలబెట్టుకుంటామని, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రైవేటు, విదేశీ వర్సిటీలకు మార్గం సులభం గత ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో చేసిన కొన్ని సవరణలు అడ్డంకిగా మారాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టాప్-100 గ్లోబల్ యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ ఉండాలనే నిబంధన యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని, దీనివల్ల కొత్త వర్సిటీల ఏర్పాటు కష్టతరంగా మారిందని అన్నారు. ఈ అడ్డంకిని తొలగించి, రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విశ్వవిద్యాలయాల ఏర్పాటును సులభతరం చేసేందుకే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :